ఓయూలో విద్యార్థుల ఆందోళన

ఓయూలో  విద్యార్థుల ఆందోళన

ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించి  ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో మంచినీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు.

గత 15 రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన  వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని  ఆగ్రహం వ్యక్తం చేశఆరు. హాస్టల్స్ లాగా కనీస మాలిక వసతులు కల్పించలేకపోతున్నారని తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన చేపడుతామని విద్యార్థులు హెచ్చరించారు.