లఖింపూర్ ఖేరీ హింసలో మృతిచెందిన కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం

లఖింపూర్ ఖేరీ హింసలో మృతిచెందిన కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీలో  జరిగిన హింసలో మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు చత్తీస్‌గఢ్, పంజాబ్ ప్రభుత్వాలు రూ. 50 లక్షల చొప్పున వేర్వేరుగా పరిహారం ప్రకటించాయి. ఈ సందర్భంగా లక్నలో మీడియతో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ మాట్లాడారు. లఖింపూర్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పారు. ఈ ఘటనలో మరణించిన రైతులతోపాటు జర్నలిస్టు కుటుంబానికి పరిహారం అందిస్తామన్నారు.

చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరపున లఖింపూర్ హింసలో మరణించిన రైతు కుటుంబాలతో జర్నలిస్టు కుటుంబానికి రూ. 50 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపారు. ఈ రెండూ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలే.