త్వరలోనే అన్నీ సర్దుకుంటాయ్

త్వరలోనే అన్నీ సర్దుకుంటాయ్

పంజాబ్ పీసీసీ చీఫ్​ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందించారు. పంజాబ్ కాంగ్రెస్ త్వరలోనే అన్నీ సర్దుకుంటాయన్నారు.  అంతా సెటిల్ అవుతుందని చెప్పారు. నవ్ జోత్ సింగ్ సిధు తన కారణంగా అప్ సెట్ కాలేదన్నారు. సిద్ధూపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయనతో చర్చిస్తానని చెప్పారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ తమ నాయకుడని... ఆయన ఢిల్లీ వెళ్లినా ఎలాంటి ప్రాబ్లం ఉండబోదన్నారు. పంజాబ్ సమస్యలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తారని చెప్పారు.