కేజ్రీవాల్‌‌ను హార్డ్ కోర్ క్రిమినల్‌‌గా చూస్తున్నారు : భగవంత్​ మాన్

కేజ్రీవాల్‌‌ను హార్డ్ కోర్ క్రిమినల్‌‌గా చూస్తున్నారు : భగవంత్​ మాన్

న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌ను కరడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. ఖైదీలకు అందించే కనీస సౌకర్యాలు కూడా అతనికి కల్పించడం లేదని పేర్కొన్నారు. సోమవారం ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌‌తో భగవంత్ ​మాన్ తీహార్​ జైల్లో కేజ్రీవాల్‌‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్​ను చూసి ఎమోషనల్ అయ్యానని, అతన్ని ఓ హార్డ్ కోర్ క్రిమినల్ లా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్​ చేసిన తప్పేంటి? స్కూల్స్, మొహల్లా క్లినిక్‌‌లు ఏర్పాటు చేయడమే ఆయన చేసిన తప్పా? అని నిలదీశారు. అలాగే, ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని కేజ్రీవాల్ తనకు సూచించారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.