
మృతులు ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే
ప్రతిరోజు భీమరం నుండి తణుకుకు బైకుల మీద అప్ అండ్ డౌన్
వర్షం వల్ల బైకులు వదిలిపెట్టి ఉమ్మడిగా ఒకే కారులు బయలుదేరి.. దుర్మరణం
పశ్చిమ గోదావారి జిల్లా: తణుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో వెళ్తున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. వర్షం వస్తోందని డ్యూటీకి వెళ్లేందుకు బైకులు వదిలి పెట్టి ఒకే కారులో బయలుదేరిన ముగ్గురు దుర్మరణం చెందారు. భీమవరం నుంచి తణుకు వచ్చి ఉద్యోగాలు నిర్వహించే వీరు.. ఇవాళ భారీ వర్షాల కారణంగా వేర్వేరుగా బైకుల్లో ఎందుకంటూ ఒకే కారులో బయలుదేరారు. తణుకు వస్తుండగా కారు అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న శేఖర్, ఉండ్రాజవరం మండలం వెలుగు శాఖలో సిసి గా పని చేస్తున్న నాగ సుభాషిణి, తణుకు రవాణా శాఖలో పని చేస్తున్న శ్రీనివాసరావు ముగ్గురు సంఘటన స్థలం లొనే మృతి చెందారు. ప్రతిరోజు మోటార్ సైకిల్ పై వేర్వేరుగా వచ్చే వీరు వర్షము కారణంగా ముగ్గురు కలసి కారులో బయల్దేరారు. వర్షం వల్ల రాకపోకలు లేకపోవడంతో వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేకపోయింది.