స్పెయిన్లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్( WBC) 2021 క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ఓడిపోయింది. తైవాన్కు చెందిన వరల్డ్ నెం1 తైజుయింగ్ చేతిలో 21-17,13-21 తేడాతో ఓటమి చెందింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తైజుయింగ్.. సింధుపై విజయాన్ని సాధించింది. దీంతో WBCలో ఆరో పతకాన్ని చేజార్చుకుంది సింధు.

