సిల్వర్ సింధు : ఇండోనేసియా ఓపెన్‌ ఫైనల్లో ఓటమి

సిల్వర్ సింధు : ఇండోనేసియా ఓపెన్‌ ఫైనల్లో ఓటమి

జకర్తా: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి సిల్వర్ తోనే సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఇండోనేసియా ఓపెన్‌ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి పాలైంది. జపాన్‌ స్టార్‌ ప్లేయర్ యమగూచి చేతిలో సింధు ఓడింది. ఫస్ట్ రౌండ్ లో 15-21, సెకండ్ రౌండ్ లో 16-21 తేడాతో ఓడిన సింధు సిల్వర్ తోనే సరిపెట్టుకుంది.

ఫస్ట్ నుంచి దూకుడుగా ఆడిన యమగూచి వరుస గేములను కైవసం చేసుకొని సింధును చిత్తుచేసింది. రెండు గేముల్లో ఆఖర్లో పాయింట్లు సాధించిన యమగూచి సింధుపై ఒత్తిడి పెంచి లీడ్ సాధించింది. ఈ సీజన్‌ లో సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో సింధు ప్రవేశించడం ఫస్ట్ టైం. 2019లో ఓ ఇంటర్నేషనల్  టోర్నీలో ఫస్ట్ టైటిల్‌ సాధించాలనుకున్న సింధు కల నెరవేరలేదు. సెమీస్‌ లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ చెన్‌ యుఫీని వరుస గేముల్లో చిత్తు చేసిన సింధు.. ఫైనల్లో ఈజీగానే గెలుస్తుందని అనుకున్నారంతా..కానీ మ్యాచ్ వన్ సైడ్ గా మారడంతో ఫైనల్లో జ‌పాన్ అమ్మాయి టైటిల్ నెగ్గింది. సింధు మరోసారి సిల్వర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.