ఇండోనేషియా ఓపెన్ లో సెమీస్ కు చేరిన పీవీ సింధు

ఇండోనేషియా ఓపెన్ లో సెమీస్ కు చేరిన పీవీ సింధు

ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్ 1000 టోర్నీలో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సింధు తన సత్తా చాటుతోంది. ఇవాళ( శుక్ర‌వారం) జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింధు.. ద‌క్షిణ కొరియా ష‌ట్ల‌ర్ సిమ్ యుజిన్ పై విక్టరీ సాధించి సెమీఫైన‌ల్ కు చేరుకుంది. క్వార్ట‌ర్స్ లో  సింధు తన  ప్ర‌త్య‌ర్థి సిమ్ యుజిన్ పై 14-21, 21-19,21-14 తేడాతో గెలుపొందింది.

తొలి సెట్‌ను గెలుచుకున్న యుజిన్  ఆ తర్వాత  సింధు దూకుడు ముందు నిల‌వ‌లేక‌పోయింది. చివ‌రి రెండు సెట్ల‌ను వ‌రుస‌గా గెలుచుకున్న సింధు సెమీస్ కు చేరుకుంది. సెమీస్ పోరులో సింధు జ‌పాన్ కు చెందిన త‌క‌హ‌షి తో గానీ థాయ్ లాండ్ కు చెందిన ర‌చ‌నోక్ ఇంత‌నోన్ తో త‌ల‌ప‌డ‌నుంది.