యువ దసరా స్పోర్ట్స్ ప్రారంభించిన పీవీ సింధు

యువ దసరా స్పోర్ట్స్ ప్రారంభించిన పీవీ సింధు

వరల్డ్  బ్యాండిటన్ ఛాంపియన్ షిప్ సాధించిన గోల్డెన్ గాళ్ పీవీ సింధు… కర్ణాటకలో మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ను ప్రారంభించింది. కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప ఆహ్వానంతో.. పీవీ సింధు… మైసూరులో యువ దసరా స్పోర్ట్స్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. సీఎంతో కలిసి సింధు టోర్నమెంట్ ను ప్రారంభించారు.

సెప్టెంబర్ పదోతేదీన సింధుకు ఆహ్వానం పంపించారు సీఎం యడియూరప్ప. “మీరు స్పోర్ట్స్ స్టార్ గా దేశానికి గర్వకారణంగా నిలిచారు. నమ్మశక్యంకాని విజయాలు అందుకున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారు. అక్టోబర్ 1న యువ దసరా 2019 ఈవెంట్ కు రాష్ట్ర అతిథిగా హాజరైతే సంతోషిస్తాం ” అని సీఎం యడియూరప్ప పీవీ సింధును ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంతో.. ఆమె కర్ణాటక అతిథిగా టోర్నీని ప్రారంభించారు. టార్చ్ వెలిగించి పోటీదారులకు అందించారు.

పీవీ సింధు సాధించిన ఘనతకు గుర్తింపుగా.. కర్ణాటక ప్రభుత్వం వేదికపై ఆమెను ఘనంగా సత్కరించింది.