ప్రభుత్వ పాఠశాలల స్థలాలు అమ్మేందుకు కుట్ర

ప్రభుత్వ పాఠశాలల స్థలాలు అమ్మేందుకు కుట్ర

విద్యకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు ఎంపీ ఆర్. కృష్ణయ్య. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే సిటు ఖాళీ ఏర్పడితే ఆరు నెలల్లో భర్తీ చేస్తున్నారని... కానీ పదేండ్లుగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన నిరుద్యోగ గర్జన లో కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.

టీచర్ల కొరత వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుంటుపడిందన్నారు. పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి ఆయా స్థలాలను అమ్ముకొనేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందని ఆరోపించారు. వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ...లేనిపక్షంలో పాఠశాల డైరెక్టర్ కార్యాలయాన్ని దిగ్భందిస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.