ఎయిర్ షోలో రాఫెల్: బెంగళూరు వచ్చేసిన జెట్స్

ఎయిర్ షోలో రాఫెల్: బెంగళూరు వచ్చేసిన జెట్స్

దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం బెంగళూరుకు వచ్చాయి. ఇక్కడి యళహంక  ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో వాటిని ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ లాండ్ చేసింది. అదేంటి ఓ వైపు వాటి కొనుగోలు ఒప్పందంపై వివాదం నడుస్తున్న సమయంలో అప్పుడే వచ్చాశాయా అనుకుంటున్నారా? తొందర పడకండి. అవి వచ్చిన పర్పస్ వేరు.

ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు యళహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో భారత్ ఎరో ఇండియా షో నిర్వహించబోతోంది. ఇందులో పాల్గొనేందుకు ఆ యుద్ధ విమానాలు భారత్ వచ్చాయి. ఫ్రాన్స్ నుంచి మొత్తం మూడు మూడు ఫైటర్ జెట్స్ ఇక్కడికి చేరాయి. వాటిలో రెండు రాఫెల్ జెట్స్. ఎరో ఇండియా షోలో ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ వివేక్ చౌధరి, మరి కొందరు టాప్ ఐఏఎఫ్ టాప్ అధికారులు.. రాఫెల్ తో విన్యాసాలు చేస్తారు.