
గచ్చిబౌలి, వెలుగు : రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత రఘునాథ్యాదవ్ తెలిపారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్నేతలు జెరిపాటి శ్రీను, సాయిరాం ఆధ్వర్యంలో హెచ్ఏంటీ మక్తా, పీఏనగర్ కాలనీ, మియాపూర్ మక్తాతో పాటు పలు కాలనీలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ లకు చెందిన నేతలు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు సుమారు 100 మందికిపైగా కాంగ్రెస్లో చేరగా.. వారికి రఘునాథ్ యాదవ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు ప్రజలు ఆకర్షితులై చేరుతున్నారని, మియాపూర్ డివిజన్కి చెందిన యువకులు భారీ సంఖ్యలో చేరడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ను రూ.500, ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రాములు గౌడ్, రాంచందర్, రషీద్, కుమార్ సాగర్, ఆఫ్రోజ్, సాయిరాం, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.