
‘ఫాదర్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా’ గా పిలవబడే రఘుపతి వెంకయ్య జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని బాబ్జీ దర్శకత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్పై మండవ సతీష్ బాబు నిర్మిస్తున్నారు. టైటిల్ పాత్రధారిగా సీనియర్ నటుడు నరేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను హీరో మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఈ రోజు ఉదయం విడుదల చేశారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేయానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్ర యూనిట్కు మహేష్ బాబు తన అభినందనలు తెలిపారు.
Wishing @ItsActorNaresh garu and the entire team of #RaghupathiVenkaiahNaidu all the best for its release on 29th November! https://t.co/I7Lbi56LPS
— Mahesh Babu (@urstrulyMahesh) November 9, 2019