ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా

ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ వారు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పుడు AP PCC చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు రఘువీరా చెప్పారు.  అయితే కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం రఘువీరా రాజీనామాపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు.