కాంగ్రెస్​ పార్టీకి రాహుల్ విరాళం

కాంగ్రెస్​ పార్టీకి రాహుల్ విరాళం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసిన  క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ‘డొనేట్ ఫర్ దేశ్’ కు ఆ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ బయటికి వెల్లడించని మొత్తాన్ని మంగళవారం విరాళంగా అందించారు. అందుకు సంబంధించి ట్వీట్​ చేశారు. ప్రగతిశీల భారత్ కోసం తన వంతు సహకారం అని తెలిపారు. భారత్ ఆత్మను రక్షించే ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగం కావాలని పిలుపునిచ్చారు.

 అందరు విరాళాలు అందించాలని కోరారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్ కూడా విరాళాలు సేకరించాలని సూచించారు. విరాళాల సేకరణలో ప్రొఫెషనల్ కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలవాలని చెప్పారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ  చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘డొనేట్ ఫర్ దేశ్’ క్యాంపెయిన్ ను లాంచ్ చేశారు. ఈ క్యాంపెయిన్​కు మహారాష్ట్ర నుంచి అధికంగా విరాళాలు వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ నిలిచాయి.