డబ్ల్యూటీసీ ఫైనల్​కు ద్రవిడ్​ బ్లూప్రింట్‌!

డబ్ల్యూటీసీ ఫైనల్​కు ద్రవిడ్​ బ్లూప్రింట్‌!

న్యూఢిల్లీ:  ఇండియా స్టార్ క్రికెటర్లు ఐపీఎల్‌‌‌‌‌‌లో బిజీగా ఉండగా..హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ వరల్డ్​ టెస్ట్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ కు ప్లాన్‌‌‌‌ రెడీ చేయబోతున్నాడు. టీమ్‌‌‌‌లోకి ఎవరిని తీసుకోవాలి?  జట్టు ఎలా ప్రిపేర్‌‌‌‌ అవ్వాలి? ఫైనల్లో ఎలా ఆడాలనే విషయంపై  తోటి కోచ్‌‌‌‌లు ఎన్​సీఏ చీఫ్​ వీవీఎస్​ లక్ష్మణ్​తో కలిసి రాహుల్‌‌‌‌ బ్లూ ప్రింట్ సిద్ధం చేయనున్నాడు. ఇందుకోసం ఇండియా కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ మంగళవారం బెంగళూరులోని ఎన్​సీఏలో భేటీ కానుంది.  జూన్ 7–11 మధ్య జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇండియా పోటీ పడనుంది. పేస్‌‌‌‌ లీడర్‌‌‌‌ బుమ్రా, బ్యాటర్లు శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌కు గాయాలు అవడంతో వారి స్థానాలను భర్తీ చేసే ప్లేయర్లను ఎంచుకోవాలి. అలాగే, వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ దృష్ట్యా  ఐపీఎల్‌‌‌‌లో ఆడుతున్న  స్టార్‌‌‌‌ క్రికెటర్ల వర్క్ లోడ్‌‌‌‌ను కూడా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ పరిశీలించనుంది. ద్రవిడ్‌‌‌‌ అండ్​ కో.. వీవీఎస్‌‌‌‌ నేతృత్వంలోని ఎన్‌‌‌‌సీఏ టీమ్‌‌‌‌తో సమావేశమై చర్చించనుందని బోర్డు వర్గాలు తెలిపాయి.