బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేస్తోంది

బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేస్తోంది

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ సర్కార్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పైనా ఆయన విరుచుకుపడ్డారు. అన్ని ప్రభుత్వ సంస్థలను ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులతో నింపేస్తున్నారని విమర్శించారు. గెలుపు కోసం మీడియా, ధనాన్ని బీజేపీ యథేచ్ఛగా వాడుకుంటోందన్నారు. ఒక్క కాంగ్రెస్ కాదని బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ పార్టీలు కూడా వరుసగా ఎన్నికల్లో పరాభవానికి గురవుతున్నాయని చెప్పారు. హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ నికోలస్ బర్న్స్ తో జరిగిన చర్చలో రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోరాడాలంటే వ్యవస్థాత్మక నిర్మాణాలు, ఆంక్షలు లేని మీడియా, ఆర్థిక వనరుల అవసరం ఉందన్నారు.