
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన బాధాకరం..హృదయ విదారకం అని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహించలేనిదన్నారు రాహుల్. ప్రభుత్వం అత్యవసర రక్షణ, తక్షణ సహాయ చర్యలు అందించాలి..ప్రతి జీవితం ముఖ్యం..ప్రతి సెకనూ ముఖ్యం..కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సాయం చేయాలన్నారు రాహుల్ గాంధీ.
సోషల్ మీడియా X లో పోస్ట్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ..అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం హృదయ విదారకం..ప్రయాణీకులు ,సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ ఆందోళన ఊహించలేనిది.బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో 133 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.17 గంటలకు ఎయిర్ ఇండియా విమానం లండన్కు బయలుదేరినప్పుడు మేఘనినగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలో విమానం కూలిపోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కనిపించింది. అగ్ని మాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.