జీ20 కోసం మురికి వాడలు దాచిపెట్టారు: రాహుల్ గాంధీ

జీ20 కోసం మురికి వాడలు దాచిపెట్టారు: రాహుల్ గాంధీ

జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీ సుందరీకరణ పనుల్లో భాగంగా మురికి వాడలను కూల్చేసి  అక్కడి ప్రజలను తరలించినట్లు కతథనాలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ప్రపంచ నేతల ముందు వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ALSO READ : న్యూఢిల్లీ డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్..

జీ 20 సదస్సు కోసం కొన్ని రోజులుగా ఢిల్లీలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే కోతులు, ఇతర జంతువులు వేదిక ప్రాంగణం వద్దకు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక, సుందరీకరణ కోసం మురికివాడల్లోని ప్రజలను తొలగించి, అవి కనబడకుండా గ్రీన్ షీట్లతో కవర్ చేసినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.