రాబోయే 20ఏళ్లు రాహుల్ గాంధీనే ప్రధాని : సీఎం రేవంత్ రెడ్డి

రాబోయే 20ఏళ్లు రాహుల్ గాంధీనే ప్రధాని  :   సీఎం రేవంత్ రెడ్డి

బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవీఎంలపై విపక్షాలతోపాటు.. ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలింగ్ కు బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నారని చెప్పారు. కేరళలోని వయనాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రేవంత్. గత పదేళ్లుగా వారణాసి ఎంపీ దేశానికి ప్రధానిగా ఉన్నారన్నారు. రాబోయే 20ఏళ్లు వయనాడ్ ఎంపీయే ప్రధానిగా ఉంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ చాంపియన్ అని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్స్ పారదర్శకత కోసమే తెచ్చామని మోదీ చెబుతున్నారని, అదే నిజమైతే సుప్రీంకోర్టు  ఈ వ్యవస్థను ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. పారదర్శకత ఉంటే ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వారిని, ముఖ్యంగా బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ పథకమన్నారు రాహుల్.