రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న నవీన్ పట్నాయక్

రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న నవీన్ పట్నాయక్

బిజు జనతాదళ్ చీఫ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. 

 2019లోనూ ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు.  అయితే బిజేపూర్‌కు రాజీనామా చేసిన ఆయన  హింజిలీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 

 కాగా  ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేడీ ఇప్పటివరకు 126 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  ఒడిశాలో 147 నియోజకవర్గాలకు గాను నాలుగు దశల్లో(మే 13, 20, 25, జూన్1 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 04న ఫలితాలు వెలువడనున్నాయి.