
ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ వచ్చే నెల 1న రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఒకే రోజు మూడు లోక్ సభ సెగ్మెం ట్ల పరిధిలోని సభల్లో పాల్గొంటారు. 1న మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ సభలో, 2 గంటలకు నాగర్ కర్నూ ల్ లోక్ సభ పరిధిలోని వనపర్తిలో, 4 గంటలకు నల్గోండ జిల్లా హుజూర్నగర్ లో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. తెలంగాణలో చేవెళ్ల వేదికగా ఈ నెల 9నే ప్రచారాన్ని రాహుల్ మొదలు పెట్టారు. ఇక్కడే కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించారు. ప్రచారానికి ఏప్రిల్ 9 వరకే గడువు ఉండటంతో మూడ్రోజుల వ్యవధిలో మరో రెండు సార్లు రాష్ట్రానికి రాహుల్ వస్తా రని పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్సభ షెడ్యూలు ఖరారైన తర్వాత తొలిసారిగా ఆయన రాష్ట్రానికి వస్తుండటంతో సభలను భారీగా నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి