రైల్లో గంజాయి సరఫరా.. ఆరుగురు అరెస్ట్

రైల్లో గంజాయి సరఫరా.. ఆరుగురు అరెస్ట్

సికింద్రాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు రైల్వే(జీఆర్పీ) పోలీసులు. విశాఖ ఏజెన్సీ నుండి కొనార్క్ ఎక్స్ ప్రెస్ లో ఒరిసా, ముంబయికి తరలిస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు. వారి నుంచి 82 కిలోల గంజాయి..మూడు సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.

మరో కేసులో ట్రైన్స్ లో బ్యాగ్స్ లిస్ట్ చేసి గోల్డ్ ఎత్తుకెళ్తున్న ఇద్దర్ని అరెస్టు చేశారు  రైల్వే పోలీసులు. వీరి నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు..లక్ష రూపాయలు నగదు..మూడు సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.