
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ) పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 08.
పోస్టుల సంఖ్య: 434
పోస్టులు: నర్సింగ్ సూపరింటెండెంట్ 272, డయాలసిస్ టెక్నీషియన్ 04, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్–II 33, ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) 105, రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 04, ఈసీజీ టెక్నీషియన్ 04, లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-–II 12.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా, జీఎన్ఎం, డి.ఫార్మా, డీఎంఎల్టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 08.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనార్టీలు లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్(ఈబీసీ)లకు రూ.250. ఇతరులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు rrbcdg.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ఎగ్జామ్ ప్యాటర్న్ : కంప్యూటర్ బేస్డ్ టెస్టులో మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. నాలుగు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్–1లో ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 ప్రశ్నలు 70 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ అర్థమెటిక్ , జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ సైన్స్ 10 ప్రశ్నలు 10 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. ఇందులో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ, ఎస్సీలకు 30 శాతం, ఎస్టీలకు 25 శాతం మార్కులు కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.