ఏడాది గ్యాప్ తర్వాత ట్విట్టర్ లోకి రాజ్ కుంద్రా ఎంట్రీ

ఏడాది గ్యాప్ తర్వాత ట్విట్టర్ లోకి  రాజ్ కుంద్రా ఎంట్రీ

దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. నిన్న (జూన్ 8న) తన భార్య శిల్పా శెట్టి 47వ పుట్టినరోజు సందర్భంగా రాజ్ కుంద్రా.. ఆమెకు విషెస్ చెబుతూ వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే నా సోల్ మేట్. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలని నా కోరిక. అంటూ రాజ్ కుంద్రా శిల్పా శెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ సైతం ఆమెకు విషెస్ తెలుపుతూ.. తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే హిందీ చలనచిత్ర పరిశ్రమను హడలెత్తించిన రాజ్ కుంద్రా ఫోర్నోగ్రఫీ కేసు అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన రాజ్ కుంద్రా.. ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్నట్టు తెలుస్తోంది.