బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ వేదికపై ఏం మాట్లాడాలో తెలీదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి తాను దూరంగా ఉండటానికి గల కారణంపై ఆయన సెప్టెంబర్ 2న స్పష్టతనిచ్చారు.
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీలో ప్రధాని మోదీ, బీజేపీని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ లీడర్లు విమర్శలు చేస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో డబుల్ బెడ్రూంలు నిర్మించి తిరిగి తమపై పొలిటికల్ దాడి చేయడమేంటని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం మత్తు దందాల అడ్డాగా మారిందని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడం, కట్టిన వాటిని అర్హులకు కేటాయించడంలో సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకునేలా సీఎం శిక్షణ ఇవ్వాలని సూచించారు.