
చంద్రగ్రహణం కారణంగా నేటి సాయంత్రం నాలుగు గంటల నుండి రేపు ఉదయం వరకు వేములవాడ రాజన్న ఆలయం మూసివేయనున్నారు. బుధవారం సంప్రోక్షణ, ప్రాత కాల పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కలుగజేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఏపీలోని తిరుమలలో కూడా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేయనున్నారు. చంద్రగ్రహణం ఉన్నందున రాత్రి 7 గంటలకు టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు.