న్యూఢిల్లీ: తాను సీఎం పదవిని వదులుకోవాలని అనుకుంటున్నా, ఆ కుర్చే తనను వదలడం లేదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. సీఎం పదవి కోసం పార్టీలో సచిన్ పైలట్ నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో గెహ్లాట్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం పదవి వదులుకోవడానికి సిద్ధం అంటూనే.. వదిలిపెట్టేందుకు ఆయన అనాసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
నాలుగో సారి కూడా తాను సీఎం కావాలని ఓ మహిళా కార్యకర్త కోరిన విషయాన్ని గెహ్లాట్గుర్తుచేసుకున్నారు. ‘నేను సీఎం పదవిని వదులుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఆ కుర్చే నన్ను వదలడం లేదు. అది నన్ను వదలకపోవచ్చు కూడా’ అని అప్పుడు తాను ఆమెకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.