వైసీపీ నాయకులపై రజినీ ఫ్యాన్స్ ఫైర్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

వైసీపీ నాయకులపై రజినీ ఫ్యాన్స్ ఫైర్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకల కోసం ఇటీవల విజయవాడకు(Vijayawada) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  రజినీకాంత్ సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యలతో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చారు. దీంతో.. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు రజినీకాంత్ పై ఫైర్ అవుతున్నారు.

నిజానికి రజినీకాంత్ వైసీపీ గురించి కానీ, వైసీపీ నాయకుల గురించి కానీ అస్సలు మాట్లాడలేదు. ఎన్టీఆర్ తో పాటు స్టేజిపై ఉన్న నాయకుల గురించి మాత్రమే మాట్లాడారు. ఈక్రమంలో చంద్రబాబుని పొగిడినందుకు గాను మాజీ మంత్రలు కొడాలి నాని, పేర్ని నాని, మంత్రి రోజాతో సహా ఇలా పలువురు వైసీపీ నాయకులు రజినీకాంత్ ను  దారుణంగా విమర్శిస్తున్నారు.. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్  వైసీపీ నాయకులపై ఫైర్ అవుతున్నారు.

70 ఏళ్ళ వయసులో కూడా రెస్ట్ తీసుకోకుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. అలాంటి సూపర్ స్టార్ ని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారని తెలియడంతో దేశవ్యాప్తంగా ఆన్న రజిని అభిమానులు ఫైర్ అవుతున్నారు. వెంటనే వైసీపీ నాయకులు రజినీకాంత్ కి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్  ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.  అక్కడితో ఆగకుండా  మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.