న్యూఢిల్లీ: దసరా నాడు ఆయుధ పూజ చేయడం మన సంప్రదాయం. గడిచిన ఐదేళ్లు హోం మంత్రిగా మన బలగాలతో కలిసి రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ ఏడాది రక్షణ మంత్రిగా ఉన్న ఆయన పాశ్చత్య దేశమైన ఫ్రాన్స్ లో ఈ సంప్రదాయాన్ని పాటించబోతున్నారు.
రాఫెల్ యుద్ధ విమానాలకు..
ఈ నెల 8న దసరా పండుగ రోజున ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానాలను (తొలి 36 జెట్స్) భారత్ కు అందజేయబోతోంది. వీటిని అధికారికంగా స్వీకరించేందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆ దేశానికి వెళ్తున్నారు. పారిస్ చేరుకుని ముందుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో భేటీ అవుతారు. అదే రోజున రాఫెల్ యుద్ధ విమానాలను అధికారికంగా స్వీకరిస్తారు రాజ్ నాథ్. ఆ యుద్ధ విమానాలకు అక్కడే ఆయన ఆయుధ పూజ నిర్వహిస్తారు.