రేవంత్ కమ్మలకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది: రేణుకాచౌదరి

రేవంత్ కమ్మలకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది: రేణుకాచౌదరి

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కమ్మలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి. అన్ని కులాలను కలుపుకు పోయేది కమ్మ సాజాజిక వర్గం.. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చి నందమూరి తారక రామారావు అని అన్నారు.కమ్మవారిలో  రైతు కూలీలున్నారు.. ఈ కరువు సమయంలో కమ్మ సామాజిక వర్గానికి కార్పొరేషన్ చాలా అవసరం అన్నారు. మనం పోయాక విగ్రహాలు కాదు.. మనం తీర్చి దిద్దే జీవితాలు శాశ్వతం అని గుర్తు చేశారు రేణుకాచౌదరి.. ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ ద్వేషి రాష్ట్రం ఏలుతూ.. తన పక్కన వారితో కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టిచే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు రేణుకాచౌదరి. కమ్మ సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని, న్యాయం చేయాలని రేణుకా చౌదరి కోరారు.