అయోధ్యలోని రామమందిర ఆలయంలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు జరగనుంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆ తరువాత హారతి ఇస్తారని, సూర్యాస్తమయం తర్వాత దీపాలను వెలిగించాలని చెప్పారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రామ జన్మభూమి ప్రధాన వాస్తుశిల్పి ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ విషయంపై స్పందిస్తూ రామ్ లల్లా విగ్రహం కర్టెన్ను ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే తొలిగిస్తారని చెప్పారు.
అనంతరం రామయ్యకు కాటుకని దిద్ది.. విగ్రహానికి బంగారు వస్త్రాలు ధరింపజేయనున్నారని తెలిపారు. అనంతరం పూజ .. 56 నైవేద్యాలను సమర్పిస్తారని వెల్లడించారు. ప్రాణ ప్రతిష్టకు ముందుగా బాల రామయ్య విగ్రహాన్ని నగర పర్యటనకు తీసుకుని వెళ్లనున్నారని వెల్లడించారు.