పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి : శశాంక్ 

పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి : శశాంక్ 
  • చేవెళ్ల సెగ్మెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ 

వికారాబాద్, వెలుగు : పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్, రిటర్నింగ్ అధికారి శశాంక్ సూచించారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ లో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను, మేరీనాట్ స్కూల్  లో  కమిషనింగ్ ను, ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఈనెల13న జరిగే పోలింగ్ కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,  విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.    వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, జడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీవో శ్రీనివాస్, వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఫెసిలిటేషన్ సెంటర్ నోడల్ అధికారి సాజిదా బేగం, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ప్రవీణ్ ఉన్నారు.