
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక
ఎల్బీనగర్,వెలుగు: ప్రజలకు అందించే వైద్యంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని రంగారెడ్డి కలెక్టర్ శశాంక హెచ్చరించారు. గురువారం ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు . హెల్త్ సెంటర్ లో రోగులకు అందిస్తున్న వైద్యంపై అడిగి తెలుసుకుని, డయాలసిస్ వార్డును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ .. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు దృష్ట్యా సరిపడా మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
గీత కార్మికులకు‘ గీత కార్మిక లైఫ్ సేవ్ కిట్’
బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ‘గీత కార్మిక లైఫ్ సేవ్ కిట్’ ను అందుబాటులోకి తేనుందని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ లో కల్లుగీత కార్మికుల వృత్తిని పరిశీలించారు. ప్రతి ఏటా గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదాల బారిన పడుతుండగా.. కొందరు చనిపోతున్నారని, మరికొందరు శాశ్వతంగా అంగవైకల్యం పొందుతున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా సేవ్ కిట్ ధరించి ఈజీగా చెట్టు ఎక్కడం చేయొచ్చన్నారు. ట్రయల్ రన్ గా ట్రైనర్స్ పర్యవేక్షణలో నిర్వహించగా.. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.దశరథ్, ఆర్ డీవో అనంతరెడ్డి, టాడీ ట్యాపర్ కార్పొరేషన్ ఎండీ ఉదయ్ ప్రకాశ్, డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉజ్వలారెడ్డి, తహసీల్దార్, ట్రైనర్ శేఖర్ బాబు, స్థానిక సంఘాల నేతలు పాల్గొన్నారు.