
కాస్త డిఫరెంట్గా..
సినిమాని సినిమాలానే చూడమంటుంటారు కొందరు. అతిగా ఇన్ఫ్లుయెన్స్ కాకూడదని అలా అంటారు. కానీ ఒక్కోసారి సినిమా వల్ల ప్రభావితులు కావడం కూడా మంచిదేనంటోంది రాణీముఖర్జీ. ప్రస్తుతం ‘మర్దా నీ 2’లో నటిస్తోంది. డిసెంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమాలో.. చిన్న వయసులోనే సైకోలా మారి, ఆడపిల్లలను రేప్ చేసి, క్రూరంగా చంపుతున్న కిల్లర్ని పట్టు కోవడానికి ప్రయత్నించే ఎస్పీ పాత్రను పోషిస్తోంది. అయితే ఆ పాత్ర, ఆ కథ రాణిని చాలా కదిలించాయి. అందుకే సినిమా ప్రమోషన్ను డిఫరెంట్గా చేస్తోంది. చాలా కాలేజీలు తిరుగుతోంది. బాల్యంలోనే నేరాలకు పాల్పడటం, బలవడం వంటి అంశాలపై యువతీ యువకులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ‘మన దేశంలో జువైనల్ క్రైమ్ రేట్ బాగా పెరుగుతోంది. ఈ విషయంలో అందరూ మేల్కోవడం చాలా అవసరం. పిల్లలు చెడుతోవ పట్టకుండా, మన ఆడపిల్లలు చెడ్డవాళ్ల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే’ అంటోన్న రాణి.. ఈ విషయాలపై అవేర్నెస్ తెచ్చేందుకు క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది. ఉమన్ డెవెలప్మెంట్ సెల్ని కలిసి కాలేజీల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి కూడా డిస్కస్ చేస్తోంది. కేవలం నటించామా, డబ్బులు తీసుకున్నామా అని కాకుండా.. ఇలాంటి బాధ్యతను తీసుకోవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.