రైతు భరోసా ఎప్పుడిస్తరు? : రాణి రుద్రమ

రైతు భరోసా ఎప్పుడిస్తరు? : రాణి రుద్రమ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ముందు తాను రైతు బిడ్డనని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపుగా  వంద రోజులవుతున్నా రైతు భరోసా ఇవ్వడంలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ ప్రశ్నించారు. 

అధికారంలోకి రాకముందు రైతు భరోసాతో సహా ఆరు గ్యారంటీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు రైతులకు భరోసా మాత్రం ఇవ్వడంలేదన్నారు. రాష్ట్రంలో రైతులను అధోగతిపాలు చేసి, రైతుల జీవితాలను దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టేశారని ఆమె మండిపడ్డారు. బుధవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఆమె మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కు ముందే రైతు భరోసాతో పాటు వరికి రూ.500 బోనస్ ఇవ్వాలని ఆమె కోరారు.