షిల్లాంగ్ : సాకేత్ సాయిరామ్ (4/33) నాలుగు వికెట్లతో విజృంభించడంతో హైదరాబాద్తో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్లో మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 111రన్స్కే కుప్పకూలింది.
కెప్టెన్ కిషన్ లింగ్గో (51) ఒక్కడే పోరాడాడు. సీవీ మిలింద్, రవితేజ, తనయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన హైదరాబాద్ తొలి రోజు చివరకు 182/4తో నిలిచింది. రోహిత్ రాయుడు (54 బ్యాటింగ్), చందన్ సహాని (52) ఫిఫ్టీలతో రాణించారు.