బోర్డు తిప్పేసిన రాథారాం మార్కెటింగ్‌ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు

 బోర్డు తిప్పేసిన  రాథారాం మార్కెటింగ్‌ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు

హైదరాబాద్ మాదాపూర్ లో  రాథారాం మార్కెటింగ్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది.   రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేల కోట్ల వరకు వసూలు చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క ఎన్టీఆర్‌ జిల్లా దుగ్గిరాలపాడులో రూ.5కోట్ల వసూలు చేశారని తెలుస్తోంది.  

రాథారాం కంపెనీ ఎండీ గుదే రాంబాబు తమ ఊరివాడని నమ్మితే నిండా ముంచేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తమ డబ్బులే కాక తమ బంధువుల దగ్గర  కూడా అప్పులు తెచ్చి కంపెనీలో డబ్బులు పెట్టామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

నూటికి 2 రూపాయల వడ్డీ ఇస్తామంటూ రాథారాం కంపెనీ పెట్టుబడులు ఆకర్షించారు . స్థానికులే కావడంతో  చాలామంది పెట్టుబడలు పెట్టారు.  ఇప్పుడు మోసపోవడంతో రాంబాబు ఇంటివద్ద బాధితులు నిరసనకు దిగారు. తమకు న్యాయ చేయాలని డిమాండ్ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.