వరుస సినిమాల్లో నటిస్తున్న ఆది సాయికుమార్.. యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతను హీరోగా కె.శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టాప్ గేర్’. రియా సుమన్ హీరోయిన్. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 30న విడుదలవుతోంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ను రవితేజ లాంచ్ చేసి టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పాడు. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్తో రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఆది ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నాడు. కథలోని పాత్రలందరూ డేవిడ్ ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. ఇంతకీ ఆ డేవిడ్ ఎవరు?, హైదరాబాద్లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్కు లింక్ ఏంటి?, క్యాబ్ డ్రైవర్ అయిన ఆదిని పోలీసులు ఎందుకు వెంబడిస్తున్నారు? అంటూ క్యూరియాసిటీ రేపేలా ట్రైలర్ కట్ చేశారు. ‘యుద్ధం గెలవాలంటే మృత్యువుతో పోరాడే గెలవాలి’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఆది, రియాకి మధ్య నడిచే లవ్, రొమాంటిక్ సీన్స్ అట్రాక్ట్
చేస్తున్నాయి.