‘బ్రేకింగ్ న్యూస్’ గా మారిన రెజీనా

‘బ్రేకింగ్ న్యూస్’ గా మారిన రెజీనా

‘ఎవరు’ సినిమా తర్వాత మంచి క్యారెక్టర్లే వరిస్తున్నాయి రెజీనాని. నేనే నా, శాకిని డాకిని లాంటి లేడీ ఓరియెంటెడ్‌‌ చిత్రాల్లో స్ట్రాంగ్ రోల్స్ చేస్తోంది. ఇప్పుడు మరో ఫిమేల్‌‌ సెంట్రిక్‌‌ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసింది. ‘రాహు’ ఫేమ్‌‌ సుబ్బు వేదుల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘బ్రేకింగ్ న్యూస్’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేశారు. కళ్యాణ్‌‌ వర్మ, వంశీ బలపనూరి, సందీప్ గాదెతో కలిసి సుబ్బునే నిర్మిస్తున్నారు. సుబ్బరాజు, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదో సోషల్ సెటైరికల్ మూవీ అని నిర్మాతలు చెప్పారు.