జియోకు భారీగా కస్టమర్లు

జియోకు భారీగా కస్టమర్లు

న్యూఢిల్లీ :  రిలయన్స్ జియో  అక్టోబర్ 2023లో 31.59 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించుకోగా,  ఎయిర్‌‌‌‌టెల్  కస్టమర్ల సంఖ్య 3.52 లక్షలు పెరిగిందని ట్రాయ్   వెల్లడించింది.  వోడాఫోన్ ఐడియా గత అక్టోబర్‌‌‌‌లో 20.44 లక్షల వైర్‌‌‌‌లెస్ సబ్‌‌‌‌స్క్రయిబర్లను కోల్పోయింది.  జియో  మొత్తం వైర్‌‌‌‌లెస్ కస్టమర్ల సంఖ్య సెప్టెంబర్‌‌‌‌లో 44.92 కోట్ల నుంచి అక్టోబర్‌‌‌‌లో 45.23 కోట్లకు చేరుకుంది.

సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్‌‌‌‌టెల్ వైర్‌‌‌‌లెస్ కస్టమర్ల సంఖ్య  3.52 లక్షలు పెరిగి అక్టోబర్‌‌‌‌లో టెల్కో కస్టమర్ల సంఖ్య 37.81 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్​ ఐడియా లిమిటెడ్​ (వీఐఎల్) కస్టమర్ల సంఖ్య 22.54 కోట్లకు తగ్గిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) డేటా తెలిపింది. నగదు కొరతతో పోరాడుతున్న వీఐఎల్​ను కస్టమర్లు భారీగా వీడుతున్నారు.