హైదరాబాద్, వెలుగు: జియో ట్రూ 5జీ సేవలు గురువారం నుంచి హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, వారణాసి, నాథ్ద్వారా (రాజస్థాన్) లలో అందుబాటులో ఉన్న జియో ట్రూ5జీ సేవలను ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులలో లాంఛ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ ఆరు సిటీలలోని లక్షలాది మంది కస్టమర్లు సర్వీస్ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని, జియో వెల్కం ఆఫర్ను ఉపయోగించుకోవాలని ఇక్కడి కస్టమర్లను రిలయన్స్ జియో కోరింది. ఈ ఆఫర్ కింద 1 జీబీపీఎస్స్పీడ్తో అన్లిమిటెడ్ 5జీ డేటా పొందవచ్చని పేర్కొంది. కస్టమర్లు ఇచ్చే ఫీడ్బ్యాక్ తమకు బాగా ఉపయోగపడుతోందని
వివరించింది.