
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ సీఎఫ్ఓ అశోక్ పాల్ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ కేసు సుమారు రూ. 68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీ వ్యవహారానికి సంబంధించినదని తెలిపింది. పాల్ను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరామని ఈడీ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యూ బీఈఎస్ఎస్ లిమిటెడ్ తరపున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకీ)కు సమర్పించిన రూ. 68.2 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ నకిలీదని తేలింది.
నకిలీ గ్యారెంటీలను జారీ చేస్తున్న ఒడిశాకు చెందిన బిస్వాల్ ట్రేడ్లింక్ కంపెనీ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు. ఈ కేసు ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ నవంబర్ 2024లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఈ కంపెనీ 8 శాతం కమీషన్కు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు జారీ చేసినట్లు ఆరోపించింది. నకిలీ బిల్లులు, లెక్కల్లో చూపని బ్యాంక్ ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించింది.