నల్లగొండ జిల్లా నాంపల్లిలో ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్.. ఐదుగురికి సీరియస్

నల్లగొండ జిల్లా నాంపల్లిలో ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్.. ఐదుగురికి సీరియస్

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాంపల్లి మండలం దేవతపల్లి గేట్ దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కకడే  నలుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సహయం కోసం హైదరాబాద్ తరలించారు. మిగిలినవారిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.