
ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం కనుల పండుగగా జరిగింది. వేద పండితులు కిషోర్ నేతృత్వంలో 9 మంది పండితులు మండప పునః పూజలు, స్పర్శ హోమాలు, అంగ హామాలు, మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం, మహాకుంభం, అమ్మవారి దర్శనం, మండప ఉద్వాసన, వేద ఆశీర్వచనం, పండిత సత్కారం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లైబ్రరీ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పొట్లూరు పద్మజ, ఉద్యోగ సంఘం నాయకులు బొల్లం మహేందర్, అవినాశ్ రావు, వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు.