జనవరి 22వ తేదీన రామరాజ్యం వచ్చేస్తోంది.. అయోధ్యలో శ్రీ రాములోరు పరిపాలన ప్రారంభం కాబోతున్నది. దేశం మొత్తం ఇప్పుడు రాములోరి గురించే మాట్లాడుకుంటుంది.. ఆ రోజు అంటే జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రాణ ప్రతిష్టతో దేశంలోని రామ భక్తులు అందరికీ పండుగ.. అలాంటి రోజు మరో అద్భుతాన్ని కూడా మన ప్రధాని మోదీ ఆవిష్కరించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.. అదేంటో తెలుసా.. రాములోరి బొమ్మతో ఉన్న కొత్త 500 రూపాయల నోట్లు.. ఇప్పటి వరకు గాంధీ బొమ్మ ఉన్న స్థానంలో.. శ్రీరామ చంద్రుడితో బొమ్మతో ఉన్న కొత్త 500 రూపాయల నోట్లను.. ఆ రోజు అంటే జనవరి 22వ తేదీ మధ్యాహ్నం విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.. కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలు నిజమే అన్నట్లు.. చాలా మంది భావించటం వివేషం.. చాలా ఇళ్లలో ఈ విషయంపై చర్చ జరగటం మరో విశేషం..
New Rs. 500 Notes will Be issued On 22/01/2024. Jai Shree Ram. ??. pic.twitter.com/uJ4CvxKbwm
— Mahindran Arokiaraj (@MahindranAroki1) January 16, 2024
ఇలాంటి సమయంలో.. ఈ వార్తలో.. శ్రీ రాముడు బొమ్మతో ఉన్న 500 రూపాయల నోట్లపై వీ6 వెలుగు మీకు నిజం చెప్పబోతుంది.. అదేంటో తెలుసా.. ఇది పచ్చి అబద్ధం.. తప్పుడు వార్త.. ఎవరో సృష్టించిన డీప్ ఫేక్ న్యూస్.. ఈ వార్తను ఎవరూ అస్సలు నమ్మొద్దు.. రాముడు బొమ్మతో ఉన్న 500 రూపాయల నోట్ల ఫొటోలను షేర్ చేయొద్దని కోరుతుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఈ వార్తలను ఖండించింది.. అలాంటిది ఏమీ జరగటం లేదని.. 500 రూపాయల నోట్లపై గాంధీ బొమ్మను తొలగించటం లేదని స్పష్టం చేస్తూనే.. రాములోరి బొమ్మతో కొత్త 500 రూపాయల నోట్లను అస్సలు విడుదల చేయటం లేదని వివరణ ఇచ్చింది.
NEW 500 NOTES WILL BE ISSUED ON 22/01/2024 pic.twitter.com/WP6XgVu1ia
— #दिव्यदृष्टा ब्रह्मऋषि रामानन्द सरस्वती (@BrahmrishiRam) January 18, 2024
జనవరి 22వ తేదీన ఎలాంటి కొత్త నోట్లు విడుదల కావటం లేదు.. జనం ఎవరూ ఆందోళన పడొద్దు.. ఒకవేళ రాములోరి బొమ్మతో మీ దగ్గరకు ఏమైనా డబ్బుల నోట్లు వస్తే.. అవి కచ్చితంగా నకిలీ నోట్లు అని తెలుసుకోండి.. అలాంటి నోట్లను ఇస్తున్న వాళ్లను పోలీసులకు పట్టించండి అని స్పష్టం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..