గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉగ్రదాడులు జరగకుండా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేయబోతుంది. ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలకూ సెక్యూరిటీ అలర్ట్ను జారీ చేసింది.
తదనుగుణంగా, అన్ని విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడం జరుగుతోంది. అందువల్ల ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించడమైనది. అంతే కాకుండా, జనవరి 20 నుంచి 30 వరకు విమానాశ్రయంలోనికి సందర్శకులను అనుమతించడంపై నిషేధం విధించారని తెలియజేయడమైనది.