ఎల్ఐసీ జోనల్ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు

ఎల్ఐసీ జోనల్ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు

హైదరాబాద్, వెలుగు : ఎల్ఐసీ జోనల్ ఆఫీసులో శుక్రవారం 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  జోనల్ మేనేజర్  ఎల్‌కే శ్యాంసుందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎల్‌ఐసీ అత్యుత్తమ సేవలను అందిస్తోందన్నారు.

కొత్త టెక్నాలజీతో కస్టమర్లకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు కావాల్సిన సేవలను వెంటనే అందిస్తున్నామన్నారు. అనంతరం ఆఫీసు ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్లు పి. రమేష్ బాబు, సతీష్ బాబు, ఎం. రవికుమార్,  ఉతుప్ జోసెఫ్,  శ్రీనివాసరావు, సీనియర్ డీఎం రాజీబ్ బిస్వాస్ పాల్గొన్నారు.