సికింద్రాబాద్, వెలుగు : సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సోషల్ వర్క్ విద్యలో పరిశోధనలు జరగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. అధ్యాపకులు ఆ దిశగా బోధించాలని ఆయన సూచించారు. సికింద్రాబాద్లోని ఓయూ పీజీ కాలేజీలో రెండ్రోజుల పాటు నిర్వహించిన సింపోజియం ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. చీఫ్గెస్టుగా హాజరైన లింబాద్రి మాట్లాడుతూ.. .
సోషల్ వర్క్ విభాగ అధ్యాపకులు సామాజిక స్పృహ, అంకితభావంతో బోధించినప్పుడే స్టూడెంట్లు రాణించగలుగుతారని సూచించారు. శాస్త్రీయ పరిశోధన దృక్పథంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ అర్జున్ రావు, సోషల్ వర్క్ విభాగం హెడ్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.