ఎన్డీఏకు భారీ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా..

ఎన్డీఏకు భారీ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా..

లోక్ సభ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ ఎన్డీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్  మంగళవారం ప్రకటించారు. కేంద్ర కేబినెట్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల కోసం బీహార్‌లో సీట్ల పంపకం విషయంలో తమ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వనందుకు బీజేపీ నాయకత్వంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. 

 తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పరాస్ తెలిపారు. కానీ ఎన్డీఏ సీట్ల పంపిణీ విషయంలో తనకు తన పార్టీకి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బీజేపీతో తమ పార్టీ స్నేహాన్ని నెరవేర్చుకుందని చెప్పారాయన.